ఓటీటీలోకి వచ్చిన ధనుష్ కొత్త సినిమా
- నెల రోజుల క్రితం విడుదలైన 'కర' చిత్రం
- బాక్సీఫీస్ వద్ద రూ.40 కోట్ల వసూళ్లు
- నేటి నుంచి నెట్ ఫ్లిక్స్లో అందుబాటులో 'కర' చిత్రం
ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కర' ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. 1990ల కాలం నేపథ్యంలో బ్యాంకుల అప్పులు, వాటిని తీర్చలేక ఒక వ్యక్తి నేర ప్రపంచంలోకి అడుగుపెట్టే పరిస్థితులను ఈ చిత్రంలో వాస్తవికంగా చూపించే ప్రయత్నం చేశారు.
ఈ చిత్రం 2026 ఏప్రిల్ 30న విడదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.40 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
ఈ చిత్రంలో ధనుష్ సరసన మమితా బైజు హీరోయిన్గా నటించారు. సీనియర్ నటుడు కేఎస్ రవికుమార్ కీలకపాత్రలో మెప్పించారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. తన సంగీతంతో 1990ల నాటి వాతావరణాన్ని అద్భుతంగా తెరపై కనిపించేలా చేశారు.
ఈ చిత్రం 2026 ఏప్రిల్ 30న విడదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.40 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
ఈ చిత్రంలో ధనుష్ సరసన మమితా బైజు హీరోయిన్గా నటించారు. సీనియర్ నటుడు కేఎస్ రవికుమార్ కీలకపాత్రలో మెప్పించారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. తన సంగీతంతో 1990ల నాటి వాతావరణాన్ని అద్భుతంగా తెరపై కనిపించేలా చేశారు.